ఎట్టకేలకు వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకృష్ణ, నర్సు జ్యోతిలతో పాటు, ఫ్రంట్లైన్ వర్కర్స్కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై చాలా కాలమైనా కేటీఆర్ టీకా తీసుకోలేదు. ఇదే సమయంలో ఆయన కరోనా బారినపడగా, టీకా తీసుకోవడం మరింత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీకా తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకృష్ణ, నర్సు జ్యోతిలతో పాటు, ఫ్రంట్లైన్ వర్కర్స్కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.