Asianet News TeluguAsianet News Telugu

కట్లు కట్టుకుని డ్రామాలకు సిద్ధం.. అచ్చం రఘునందన్ దారిలోనే, స్కెచ్ రెడీ: ఈటలపై కొప్పుల సంచలనం

బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈటల రాజేందర్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 12,13,14న దాడి జరిగినట్లు సృష్టించి .. కాళ్లకు, చేతులకు ఈటల కట్లు కట్టుకుంటారని కొప్పుల ఆరోపించారు. 

minister koppula eshwar sensational comments on etela rajender over huzurabad by poll
Author
Hyderabad, First Published Sep 30, 2021, 8:29 PM IST

బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈటల రాజేందర్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 12,13,14న దాడి జరిగినట్లు సృష్టించి .. కాళ్లకు, చేతులకు ఈటల కట్లు కట్టుకుంటారని కొప్పుల ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు కట్టు కట్టుకుని సింపతి క్రియేట్ చేశారని .. ఈటల కూడా అదే ఫాలోకాబోతున్నారని మంత్రి ఆరోపించారు. బీజేపీ అంటేనే కుట్రపూరిత పార్టీ అని విమర్శలు గుప్పించారు కొప్పుల. దీనిపై తనకు అత్యంత కీలకమైన సమాచారం అందిందన్నారు. 

కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios