Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ కు తెలంగాణ పిసిసి పగ్గాలు ఇప్పించింది చంద్రబాబే... ఎందుకో తెలుసా?: మంత్రి హరీష్

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడే ఈ పదవిని తన సన్నిహితుడు రేవంత్ కు ఇప్పించాడని హరీష్ ఆరోోపించారు. 

minister harish rao sensational comments on TPCC chief revanth and chandrababu akp
Author
Siddipet, First Published Jul 9, 2021, 4:22 PM IST

సిద్దిపేట: టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరు కాబట్టి తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో తిరిగి అడుగు పెట్టాలని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చూస్తున్నారని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంద్రాబాబు అని ప్రజలు వెల్లగొట్టారు..ఇప్పుడు అదే కాంగ్రెస్ ముసుడులో మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని అన్నారు. 
 
నాలుగో విడత పల్లెప్రగతిలో భాగంగా సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో హరీశ్ రావు పర్యటించారు. టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో బెజ్జంకి కమాన్ నుంచి మండలకేంద్రం వరకూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రికి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు గ్రామ, మండల ప్రజాప్రతినిధులు. ముందుగా గ్రామ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డప్పు చప్పుల నడుమ బోనాలతో మహిళలు మంత్రికి గ్రామస్తులు స్వాగతం పలికారు. 

అలాగే కల్లేపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్-అంబేద్కర్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.  లయన్స్ క్లబ్ ఆఫ్ బెజ్జంకి తరపున రూ.80 వేల రూపాయల విలువ కలిగిన బాడీ ఫ్రీజర్- శవ పేటికను కల్లెపల్లి గ్రామ పంచాయితీకి అందజేసిన సందర్భంగా క్లబ్ సభ్యులు మోహన్, రవీంద్ర ప్రసాద్ లను మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మంత్రి హరీశ్ రావులు అభినందించారు. అనంతరం కల్లెపల్లి గ్రామ రైతువేదికను ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. 

read more  ఉపఎన్నిక ఎఫెక్ట్... హుజురాబాద్ పై మంత్రి ఎర్రబెల్లి వరాల జల్లు
  
''కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు తన వాళ్లకు పదవులు ఇప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరు... ఓటుకు నోటు కేసులో ఉన్నవాళ్లే కదా. చంద్రబాబు కు అత్యంత‌ సన్నిహితుడు. ఇప్పుడు పీసీసీ‌ చీఫ్ గా వచ్చాడు. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వస్తున్నాడు'' అని అన్నారు. 

''బీజేపీ ధరలు పెంచింది తప్ప దేశానికేం చేసింది. గులాబీ జెండాతోనే తెలంగాణాకు సాగు, తాగు నీరు. టీఆర్ఎస్ జెండా ఎత్తుకున్నాక.. పొలాల్లో నీళ్లు, ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయి. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పని టీఆర్ఎస్ చేసింది. ఏ చెరువు చూసిన నీటితో నిండి ఉన్నాయి. వానలు ఇంకా  రాకముందే కాళేశ్వరం నీటితో నిండిపోయాయి'' అని అన్నారు. 

''కాంగ్రెస్ హయాంలో క్రాప్ లోన్లు రావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాలు బయట పెట్టకుండా రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఎకరానికి 5 వేలు రూపాయలు.. విత్తనాలు, నాట్లు, నారుమడి వంటి ఖర్చు కోసం ఇస్తున్నారు. బీజేపీ ఏమైనా ఇస్తోందా...  ఏమీ ఇవ్వకపోగా ధరలు మాత్రం పెంచి పేదల నడ్డి విరుస్తోంది. డీజిల్ ధర రూ.100 చేసింది. రైతు శ్రేయస్సు కై ఎకరానికి టీఆర్ఎస్ 5 వేలు ఇస్తే, డీజిల్ ధర పెంచి బీజేపీ రైతుల పైసలు గుంజేసింది'' అని మండిపడ్డారు. 

''కరోనా కష్టకాలంలోనూ మేం రైతుల‌ నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఒక్క గింజ లేకుండా ధాన్యం కొన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణానే.  90 లక్షల మెట్రిక్ టన్నులు యాసంగిలో కొన్నాం. ఆంధ్రప్రదేశ్ లో  24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.  ఆనాడు ఆంధ్రా వాళ్లు వ్యవసాయం రాదని వెక్కిరించారు.. ఈనాడు వాళ్లు అసూయ పడేలా తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.దేశంలో 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులు పంజాబ్ పండించగా  తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించి దేశంలో నెంబర్ వన్ స్థానంలో‌ నిలిచింది.
   దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారింది'' అని మంత్రి వెల్లడించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios