Asianet News TeluguAsianet News Telugu

పరాయి వ్యక్తి భార్యా పిల్లలతో జగ్గారెడ్డి అమెరికా వెళ్లాడు : హరీష్ రావు

కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి హరిష్ రావు నిప్పులు చేరిగాడు. ఆయన తెలంగాణ ద్రోహే కాదు దేశ ద్రోహి కూడా అంటూ ఘాటుగా విమర్శించారు. పరాయి వ్యక్తి భార్యా పిల్లలతో అమెరికా వెళ్లి మానవ అక్రమ రవాణాకు పాల్పడి జగ్గారెడ్డి దేశ ద్రోహిగా మారాడని మండిపడ్డారు. కట్టుకున్న భార్యను, రక్తం పంచుకుపుట్టిన పిల్లల్ని మోసం చేసిన ఘనుడు ఈ జగ్గారెడ్డి...ఇతడితో తిరిగేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సిగ్గుపడుతున్నారని అన్నారు. ఇలాంటి పనులు చేసిన వ్యక్తికి ఓ మహిళగా సునితా లక్ష్మారెడ్డి ఎలా మద్దతిస్తారంటూ ప్రశ్నించారు. నైతిక విలువలు లేని జగ్గారెడ్డి సీటు ఎలా ఇస్తారని హరీష్ ప్రశ్నించారు.

minister harish rao fires on sangareddy ex mla jagga reddy
Author
Hyderabad, First Published Sep 29, 2018, 4:38 PM IST

కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి హరిష్ రావు నిప్పులు చేరిగాడు. ఆయన తెలంగాణ ద్రోహే కాదు దేశ ద్రోహి కూడా అంటూ ఘాటుగా విమర్శించారు. పరాయి వ్యక్తి భార్యా పిల్లలతో అమెరికా వెళ్లి మానవ అక్రమ రవాణాకు పాల్పడి జగ్గారెడ్డి దేశ ద్రోహిగా మారాడని మండిపడ్డారు. కట్టుకున్న భార్యను, రక్తం పంచుకుపుట్టిన పిల్లల్ని మోసం చేసిన ఘనుడు ఈ జగ్గారెడ్డి...ఇతడితో తిరిగేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సిగ్గుపడుతున్నారని అన్నారు. ఇలాంటి పనులు చేసిన వ్యక్తికి ఓ మహిళగా సునితా లక్ష్మారెడ్డి ఎలా మద్దతిస్తారంటూ ప్రశ్నించారు. నైతిక విలువలు లేని జగ్గారెడ్డి సీటు ఎలా ఇస్తారని హరీష్ ప్రశ్నించారు.

శనివారం సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఆ తర్వాత నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి తిడుతూ...టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను ప్రశంసించారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కాదని...తెలంగాణ సాధకులకు,తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నైతిక విలువలే లేవని... చంద్రబాబు కనుసన్నల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పెత్తనం తీసుకురావడానికి సిద్దపడుతోందన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాస్తా, తెలుగుదేశం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మారిందని ఎద్దేవా చేశారు.  

 సంగారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మచ్చలేని మనిషని మంత్రి హరీశ్ రావు‌ ప్రసంశించారు. నాలుగేళ్ల లో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రజల కోసమే పని చేశారని కితాబిచ్చారు. వచ్చే ఎన్నికల్లో చింతా ప్రభాకర్ గెలుపు ఖాయమని, 73 వేల మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు , నేతలకు సూచించారు. జగ్గారెడ్డికి డిపాజిట్ దక్కకుండా ఉండేలా పని చేయాలన్నారు. చింతా ప్రభాకర్ ను గెలిపించి సంగారెడ్డి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్నారు. చింతా ప్రభాకర్ కు కుడి భుజంగా ఉంటానని, సిద్దిపేట మాదిరే సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానని మంత్రి హమీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

హరీష్ రావుకి తృటిలో తప్పిన ప్రమాదం

సంగారెడ్డి ప్రమాదంపై హరీష్ ఏమన్నారంటే....

 

Follow Us:
Download App:
  • android
  • ios