Asianet News TeluguAsianet News Telugu

పురుగులమందు తాగి.. మిడ్ మానేరు నిర్వాసిత రైతు ఆత్మహత్యాయత్నం..(వీడియో)

అయితే, రాజయ్య మరణానికి మిడ్ మానేరు ప్రాజెక్టులో నీట మునిగిన ఇళ్ల పైసలు ఏళ్ళు గడుస్తున్నా రాలేదని ఆవేదనతోనే అతను దారుణానికి తెగబడ్డాడని తెలిసింది. దీనికోసం యేండ్లుగా అధికారులు చూట్టు తిరిగిన ఫలితం లేకుండా పోయిందని, ఎప్పుడు అడిగినా డబ్బులు లేవని తిప్పి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Mid Manor expatriate farmer committed suicide in rajanna sircilla
Author
Hyderabad, First Published Sep 25, 2021, 12:36 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన మిడ్ మానేరు (Mid Manair)నిర్వాసితుడు, రైతు రాజయ్య పురుగుల మందు (Pesticide) తాగి ఆత్మహత్యయత్నానికి(Suicide) పాల్పడ్డాడు. దీంతో అతడి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. 

"

అయితే, రాజయ్య మరణానికి మిడ్ మానేరు ప్రాజెక్టులో నీట మునిగిన ఇళ్ల పైసలు ఏళ్ళు గడుస్తున్నా రాలేదని ఆవేదనతోనే అతను దారుణానికి తెగబడ్డాడని తెలిసింది. దీనికోసం యేండ్లుగా అధికారులు చూట్టు తిరిగిన ఫలితం లేకుండా పోయిందని, ఎప్పుడు అడిగినా డబ్బులు లేవని తిప్పి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతేకాదుతాను భూమిలో పంట వేసుకుంటే పంటను చెడగొట్టి హరితహారం మొక్కలు పెట్టారని రైతు కూమరుడు మహేందర్ అరోపిస్తున్నాడు. కేవలం అధికార పార్టీ నాయకులకు దగ్గరగా ఉన్న వారికి మాత్రమే డబ్బులు వచ్చాయని, తమను ఎళ్ల తరబడిగా తిప్పించుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios