సారాంశం

ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజ్‌లో చదువుకుంటున్న మానస అనే మెడికో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఖమ్మంలో దారుణం జరిగింది. నగరంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని మానసగా గుర్తించారు. ఈమె మమతా మెడికల్ కాలేజీలో చదువుకుంటోంది. ఆదివారం హాస్టల్‌లో మానస పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.