తాళి కట్టి.. లోబర్చుకొని తప్పించుకొని తిరిగిన కానిస్టేబుల్.. దీంతో ఆమె ఏం చేసిందంటే.. ?
పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్న ఓ కానిస్టేబుల్.. కొన్ని రోజుల తరువాత ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆ యువతి అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రేమిస్తున్నాని వెంటబడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ఒప్పించాడు. దీంతో ఆ యువతి అతడి మాట నమ్మింది. కొంత కాలం కలిసి ఉన్నారు. కానీ ఈ మధ్య తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో ఆ యువతి ఆ యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించుకొని కూర్చుంది. ఈ ఘటన చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో బుధవారం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం..
సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని రామునిపట్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ప్రేమిస్తున్నానని చెప్పాడు. మూడేళ్లుగా ఇలానే చెబుతూ ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే అదే సమయంలో ఆ యువతికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయితే ఈ విషయం అతడికి చెప్పి.. పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ అతడు స్పందించలేదు.
ఏడాది క్రితం ఆ యువతికి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన తరువాత అతడు మళ్లీ ఆమెతో ఛాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పాడు. తన వెంట రావాలని కోరారు. దీంతో ఆమె అతడిని నమ్మింది. ఇంట్లో నుంచి అతడితో యువతి వెళ్లిపోయింది. అయితే ఆమెను అందరి ముందు పెళ్లి చేసుకోకుండా కరీంనగర్ లోని ఓ కిరాయి ఇంట్లో ఉంచాడు. ఆ సమయంలోనే యువతికి తాళి కట్టాడు. కొన్ని రోజులు కలిసి ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఆమెను తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆమె ధైర్యం చేసింది. యువకుడి గ్రామానికి వచ్చి ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. న్యాయం జరిగే వరకు ఎవరు చెప్పినా వినేది లేదని ఇంటి ఎదుట కూర్చుంది. ఆ యువతికి కుటుంబ సభ్యులు అండగా నిలిచారు.