Asianet News TeluguAsianet News Telugu

తాళి కట్టే సమయానికి పెళ్లిని అడ్డుకున్న యువతి.. పీటల మీద ఆగిపోయిన పెళ్లి.. అసలేం జరిగిందంటే..

మంచిర్యాల జిల్లాలో ఓ పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోయింది. పెళ్లి కొడుకు తనను మోసం చేశాడని ఓ యువతి పెళ్లి మండపానికి చేరుకోవడంతో.. పెళ్లి కూతురు పెళ్లిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

marriage stalled in last minute in mancherial district after woman allegations against groom
Author
First Published Aug 10, 2022, 2:07 PM IST

మంచిర్యాల జిల్లాలో ఓ పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోయింది. పెళ్లి కొడుకు తనను మోసం చేశాడని ఓ యువతి పెళ్లి మండపానికి చేరుకోవడంతో.. పెళ్లి కూతురు పెళ్లిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వివరాలు.. మందమర్రి మండలానికి చెందిన ఓ యువకుడికి..వరంగల్‌కు చెందిన యువతికి పెళ్లి నిశ్చయించారు. మంచిర్యాల జిల్లా గద్దె రేగడిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతుండగా.. ఓ యువతి అక్కడికి చేరుకుంది. తాళికట్టే సమయంలో ఒక్కసారిగా ఓ యువతి అక్కడికి చేరుకుని.. పెళ్లి  కొడుకు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది. 

ఈ పెళ్లి జరగడానికి వీల్లేదంటూ యువతి అక్కడే బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. ఆ యువతికి, పెళ్లి కొడుకుకు మధ్య ప్రేమ వ్యవహారం ఉందా?, యువతి చెబుతున్న మాటలు నిజమేనా? అని ఆరా తీస్తున్నారు. 

మరోవైపు పెళ్లి మండపంలో పెళ్లికొడుకుపై యువతి వచ్చి ఆరోపణలు చేయడంతో.. ఈ పెళ్లి ఆగిపోయింది. పెళ్లి రద్దు చేయాలని.. పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios