ఇద్దరితో ఒకేసారి వివాహేతర సంబంధం.. చివరకు..
కనకరాజు ప్రియురాలితో శ్రీకాంత్రెడ్డికి కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండుమూడు పర్యాయాలుగా సదరు మహిళ శ్రీకాంత్రెడ్డితో ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లింది.
ఓ మహిళ ఒకేసారి ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ కారణం వల్లే ఆమె ఇద్దరి ప్రయుడిల్లో ఒకరు దారుణ హత్యకు గురికావాల్సి వచ్చింది. ఈ సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హస్మత్ పేట్ ప్రాంతానికి చెందిన కనకరాజు అనే వ్యక్తికి పదేళ్లుగా ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. వారికి ఒక బాబు కూడా జన్మించాడు. సదరు మహిళను కనకరాజు మచ్చబొల్లారంలోని అంజనాపురి కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. ఆ ఇంటి ఎదురుగానే ఆటో డ్రైవర్ శ్రీకాంత్రెడ్డి కూడా నివసిస్తున్నాడు.
కాగా కనకరాజు ప్రియురాలితో శ్రీకాంత్రెడ్డికి కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండుమూడు పర్యాయాలుగా సదరు మహిళ శ్రీకాంత్రెడ్డితో ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లింది. ఈ విషయం తెలిసిన కనకరాజు శ్రీకాంత్రెడ్డిని పలుమార్లు బెదిరించాడు.
అయినప్పటికీ అతని ప్రియురాలు, శ్రీకాంత్రెడ్డి ఇటీవల ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ప్రాంతానికి మరోసారి పారిపోయారు. విషయం తెలుసుకున్న కనకరాజు, ప్రియురాలి సోదరుడు చంద్రశేఖర్ 40 రోజుల క్రితం వారిని హైదరాబాద్కు తీసుకువచ్చారు. జవహర్నగర్లోని దమ్మాయిగూడలో కనకరాజుకు చెందిన అపార్టుమెంట్ పెంట్హౌజ్లో శ్రీకాంత్ను బంధించాడు. వారికి కాపలాగా ఆయన దగ్గర పని చేసే ఇద్దరిని ఉంచాడు.
శ్రీకాంత్రెడ్డిని చిత్ర హింసలకు గురి చేశాడు. అయినప్పటికీ శ్రీకాంత్రెడ్డి కనకరాజు ప్రియురాలితోనే ఉంటాని తేల్చి చెప్పాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడన్న కారణంగా శ్రీకాంత్రెడ్డిని ఈనెల 6న తాడుతో కాళ్లు, చేతులు వెనుకకు విరిచి కట్టి, మరో తాడుతో ఉరేసి హత్య చేశాడు. అనంతరం కనకరాజు స్విఫ్ట్ డిజైర్ కారులో శ్రీకాంత్రెడ్డి మృతదేహాన్ని హస్మత్పేట్ శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. కనకారాజు శ్మశాన వాటిక నిర్వాహకుడు రాజేష్ తో అప్పటికే మాట్లాడుకుని ఒక గొయ్యిని తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. కాగా.. తాజాగా ఈ కేసును పోలీసులు చేధించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.