Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్‌లో దారుణం, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని.. యువకుడిపై కత్తులతో దాడి

తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో ఇద్దరు వ్యక్తులు యువకుడిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

man injured In Knife Attack in karimnagar district
Author
First Published Sep 21, 2022, 9:18 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో బుధవారం కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. మండల కేంద్రానికి చెందిన గడ్డం చందు అనే వ్యక్తిని, జగిత్యాలకు చెందిన గడ్డం రాజు, హైదరాబాదుకు చెందిన బుట్టి చింటూలు కత్తితో తీవ్రంగా గాయపరిచారు. గడ్డం చందు, గడ్డం నందిత అనే ఇద్దరు ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదంతా ఇష్టంలేని గడ్డం రాజు, బుట్టి చింటూ కక్షతో చందును కత్తితో పొడిచారు. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios