Asianet News TeluguAsianet News Telugu

మహబూబాబాద్ జిల్లాలో విషాదం: గంటల వ్యవధిలో పెళ్లి, విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

మహబూబాబాద్  జిల్లాలోని కొమ్ముగూడెంలో  విద్యుత్  షాక్ తో  యువకుడు   మృతి చెందారు. 

Man Dies  electrocution in Mahabubad District lns
Author
First Published May 11, 2023, 5:27 PM IST

మహబూబాబాద్: జిల్లాలోని కొమ్ముగూడెంలో  విద్యుత్  షాక్ తో   యువకుడు గురువారంనాడు   మృతి చెందాడు.  రేపు  ఆ యువకుడి పెళ్లి.  పెళ్లి పీటలెక్కాల్సిన  యువకుడు  మృతి చెందడంతో   కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కొమ్ముగూడెం  గ్రామానికి  చెందిన  భూక్యా  యాకూబ్ కు  రేపు వివాహం.   దీంతో  యాకూబ్  నివాసానికి  బంధువులు  చేరుకున్నారు.  పెళ్లి పనుల్లో  అంతా బిజీగా  ఉన్నారు. అయితే  తమ నివాసంలో  బోరు  పనిచేయడం లేదు. దీంతో  యాకూబ్  బోరు రిపేర్ చేసే సమయంలో  విద్యుత్ షాక్ కు  గురై    మృతి చెందాడు. యాకూబ్ మృతితో  కుటుంబ సభ్యులు  దీంతో  షాక్ కు  గురయ్యారు.  కన్నీరు మున్నీరుగా  విలపిస్తున్నారు.   ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios