Asianet News TeluguAsianet News Telugu

విషాదం : ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తుండగా, తిరగబడ్డ ట్రాక్టర్.. యువకుడు మృతి

పెద్దపల్లి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన రైతులు , స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

man dies after tractor overturns in peddapalli district ksp
Author
First Published May 16, 2023, 8:35 PM IST

పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సుల్తానాబాద్ మండలం చిన్నబంకూర్ గ్రామానికి చెందిన వరికిల సతీష్ అనే యువకుడు మంగళవారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తున్నాడు. అయితే మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన రైతులు , స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios