Asianet News TeluguAsianet News Telugu

భార్యతో గొడవ.. కూతుళ్లకు విషం కూల్ డ్రింక్ తాగించి..ఆపై..

మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఓ చిన్నారి ఉసురు తీశాయి. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను పోషించలేక కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చాడు ఓ తండ్రి.  ఆపై నవ్వుతూ వారికి తాగండి రా అంటూ చెప్పి తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

man committed suicide with her daughter at sadasivpet - bsb
Author
Hyderabad, First Published Apr 10, 2021, 4:31 PM IST

మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఓ చిన్నారి ఉసురు తీశాయి. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను పోషించలేక కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చాడు ఓ తండ్రి.  ఆపై నవ్వుతూ వారికి తాగండి రా అంటూ చెప్పి తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కూల్ డ్రింక్ గొంతు దిగగానే తప్పు చేశాననే భావన కలిగింది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిలో ఇద్దరు ప్రాణాలు దక్కగా ఒకరి ప్రాణం పోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో కలకలం రేపింది.

ఆత్మకూరు గ్రామానికి చెందిన శివకుమార్, లలితా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు నవ్యశ్రీ (4), సిరి (5) ఉన్నారు. వీరు హైదరాబాదులో ఉంటున్నారు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం మళ్లీ గొడవ జరిగింది. దీంతో భర్త శివకుమార్ పిల్లలని తీసుకుని హైదరాబాద్ నుంచి ఆత్మకూరు వచ్చాడు.

రాత్రి కూల్ డ్రింక్ లో విషగుళికలు కలిపాడు. పిల్లలకు తాగించిన తర్వాత తాను కూడా తాగాడు. ఆ తర్వాత బయటికి వెళ్లి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇంటికి వచ్చి చూడగా పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో ఆందోళన చెందిన శివకుమార్ వెంటనే తాను చేసిన పని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు పిల్లలను, అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే నవ్యశ్రీ మృతి చెందింది.

సిరి, శివకుమార్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో  కొట్టుమిట్టాడుతున్నారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios