Asianet News TeluguAsianet News Telugu

సంగారెడ్డిలో దారుణం : రికవరీ ఏజెంట్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. లోన్ కట్టినా తనను వేధింపులకు గురిచేయడంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 

man commits suicide in sangareddy district
Author
First Published Nov 25, 2022, 4:52 PM IST

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ వేధింపులు భరించలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్‌కు చెందిన జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ కట్టినా మళ్లీ అడుగుతున్నారని మనస్తాపానికి గురైన జాన్సన్ సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios