హైదరాబాద్లో దారుణం జరిగింది. మియాపూర్లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆటోనగర్కు చెందిన ప్రవీణ్ అనే యువకుడిని తెల్లవారుజామున ధర్మపురిక్షేత్రం వద్ద నరికి చంపారు
హైదరాబాద్లో దారుణం జరిగింది. మియాపూర్లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆటోనగర్కు చెందిన ప్రవీణ్ అనే యువకుడిని తెల్లవారుజామున ధర్మపురిక్షేత్రం వద్ద నరికి చంపారు. అనంతరం తల, మొండెంను వేరు చేసి తలను బొల్లారం చౌరస్తాలో పడేశారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తల, మొండెంను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
