నల్గొండ జిల్లాలో విషాదం:పెళ్లికి పెద్దల నిరాకరణ, ప్రేమ జంట ఆత్మహత్య
పెళ్లికి ఒప్పుకోలేదని రెండు రోజుల క్రితం ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనుముల మండలం తెట్టేకుంటలో చోటు చేసుకొంది.
నల్గొండ: ఉమ్మడి Nalgonda జిల్లాలో ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమ జంట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మృతి చెందింది. జిల్లాలోని Haliya మండలం తెట్టేకుంట గ్రామానికి చెందిన Mattapalli Kondal (21), Sandhya (19)లు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగిSuicide attempt చేశారు. తమ Marriage పెద్దలు ఓప్పుకోవడం లేదని భావించిన ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గుర్తించి స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.
also read:ప్రియుడితో ఏకాంతంగా కనిపించిన కూతురు.. ఒళ్లుమండిన తండ్రి చేసిన పని...
మట్టపల్లి కొండలు, సంధ్యలు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. అయితే ఈ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ ఇంటి నుండి వెళ్లిపోయి ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో కూడ తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికి ఒప్పుకోలేదనే ఉద్దేశ్యంతో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంగా ఆత్మహత్యలు చేసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.