కారు బీభత్సం: పెళ్లి చేసుకుందామని వెళ్తున్న ప్రేమజంట బలి
యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట మరణించింది. పెళ్లి చేసుకొనేందుకు ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
చౌటుప్పల్: యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట మరణించింది. పెళ్లి చేసుకొనేందుకు ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన ప్రేమజంట పెళ్లి చేసుకొనేందుకు స్కూటీపై ఇవాళ కొండగట్టుకు బయలుదేరారు. చౌటుప్పల్ వద్దకు ఈ ప్రేమజంట వెళ్తున్న వాహనం చేరుకోగానే వెనుక నుండి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రేమ జంట ప్రయాణీస్తున్న స్కూటీ వెనుక ఉన్న బైక్ ను ఢీ కొట్టిన తర్వాత అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ రోడ్డుపైనే పల్టీ కొట్టింది. స్కూటీపై ఉన్న యువతి, యువకుడు రోడ్డుపై పడిపోయారు.
ఈ ప్రమాదంలో స్కూటీ నుండి పెట్రోల్ లీకై దగ్దమైంది. ప్రమాదంలో స్కూటీపై ప్రయాణీస్తున్న యువతి అక్కడికక్కడే మరణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు.
కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు కూడ గాయపడ్డారు. కారుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.