Asianet News TeluguAsianet News Telugu

కారు బీభత్సం: పెళ్లి చేసుకుందామని వెళ్తున్న ప్రేమజంట బలి

యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో  సోమవారం నాడు జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ప్రేమ జంట మరణించింది. పెళ్లి చేసుకొనేందుకు ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 

love couple dies in road accident at Choutuppal in Yadadri Bhuvanagiri District lns
Author
Choutuppal, First Published Oct 12, 2020, 2:25 PM IST


చౌటుప్పల్: యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో  సోమవారం నాడు జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ప్రేమ జంట మరణించింది. పెళ్లి చేసుకొనేందుకు ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 

రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన  ప్రేమజంట  పెళ్లి చేసుకొనేందుకు స్కూటీపై ఇవాళ కొండగట్టుకు బయలుదేరారు. చౌటుప్పల్ వద్దకు ఈ ప్రేమజంట  వెళ్తున్న  వాహనం చేరుకోగానే వెనుక నుండి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రేమ జంట ప్రయాణీస్తున్న స్కూటీ వెనుక ఉన్న బైక్ ను ఢీ కొట్టిన తర్వాత అదుపుతప్పి  స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ రోడ్డుపైనే పల్టీ కొట్టింది. స్కూటీపై ఉన్న యువతి, యువకుడు రోడ్డుపై పడిపోయారు. 

ఈ ప్రమాదంలో స్కూటీ నుండి పెట్రోల్  లీకై దగ్దమైంది. ప్రమాదంలో స్కూటీపై ప్రయాణీస్తున్న యువతి అక్కడికక్కడే మరణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు.

కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు కూడ గాయపడ్డారు. కారుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో  ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios