Asianet News TeluguAsianet News Telugu

పెళ్లై, రెండేళ్లు పెద్దదైన యువతితో ప్రేమ.. ఇంట్లో ఒప్పుకోలేదని జంట ఆత్మహత్య..

ఒకే సామాజిక వర్గానికి చెందినా తమ ప్రేమకు వయసు, పెళ్లి అడ్డు రావడంతో ఓ జంట చెట్టుకు ఉరేసుకుని చనిపోయిన ఘటన సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. 

love couple committed suicide in sircilla
Author
Hyderabad, First Published May 25, 2022, 9:08 AM IST

సిరిసిల్లా : వారిద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఒకే చోట job చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమెకు marriage అయింది.. వయసులో రెండేళ్లు పెద్దది. అయినా ఇద్దరూ  చాటుమాటుగా కలిసి తిరుగుతున్నారు. విషయం తెలిసి familyలో కలతలు పెరిగి, శాశ్వతంగా జీవితం పంచుకోవాలని భావించిన ప్రేమజంట suicide చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్ కు చెందిన వెంకవ్వ, దశరథం దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు గతంలో అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కుమారుడు నామా వేణుగోపాల్ (24), ఇదే పట్టణానికి చెందిన మచ్చ పూజ (26) ఇద్దరు స్థానికంగా గోపాల్ నగర్ లోని ఓ ప్రైవేట్ క్లినిక్ రిసెప్షన్ లో పనిచేస్తున్నారు.

ఒకే సామాజిక వర్గానికి చెందిన మీరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆమెకు నాలుగేళ్ల క్రితమే మేనబావ అజయ్ తో పెళ్లి చేశారు. భర్తతో ఆమె సఖ్య గా ఉండడం లేదు. అవివాహితులైన వేణుగోపాల్ తో కలిసి తిరుగుతుంది.  వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి ఆమె ఇంటికి రోజుమాదిరిగా తిరిగి రాకపోవడంతో సిరిసిల్ల పోలీస్స్టేషన్లో భార్య అదృశ్యమైందని మే 16న భర్త ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసి మనస్థాపానికి గురైన జంట 5 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి.. మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని ధర్మారం చౌరస్తా సమీపానికి బైక్ వచ్చారు. అక్కడ ఓ చెట్టుకు వేసుకున్నారు. ఆయా కుటుంబాల్లో విషాదం నింపారు.  జంట ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, కర్నాటకలో ఇలాంటి ఘటనే రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. తమ loveను ఇరు కుటుంబాలు వ్యతిరేకించడంతో తాము ప్రయాణించిన కారుపై petrol పోసుకుని నిప్పంటించుకుని యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన karnatakaలో చోటు చేసుకుంది.  ఉడిపి జిల్లా బ్రహ్వార తాలూకా హెగ్గుంజె గ్రామ సమీపంలో కారు దహనమవుతుండటాన్ని చూసిన స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే యువతీ యువకులు అగ్నికి ఆహుతయ్యారు. బెంగుళూరుకు చెందిన యశ్వంత్, జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

ఈ నేపథ్యంలో జ్యోతి, యశ్వంత్ శనివారం రాత్రి మంగళూరు చేరుకున్నారు. అక్కడే ఓ కారును అద్దెకు తీసుకుని ఉడిపివైపుకు పయనమయ్యారు. అంతకు ముందే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కుటుంబపెద్దలకు తెలిపినట్లు సమాచారం. వారు అప్రమత్తం అయ్యేలోపే ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కారుపై పెట్రోల్ పోసుకుని లోపల కూర్చుని నిప్పంటించుకున్నారు. బ్రహ్మావర  పోలీసులు కేసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios