Praja Palana Application: ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీల కోసం కాంగ్రెస్ పార్టీ ‘అభయహస్తం’ పథకం కింద దరఖాస్తులు స్వీకరించిన వేళ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ ఘటనేంటీ? 

Praja Palana Application:తెలంగాణలో రేవంత్ సర్కార్ చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ఓ జాతరలా సాగింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీల కోసం కాంగ్రెస్ పార్టీ ‘అభయహస్తం’ పథకం కింద దరఖాస్తులు స్వీకరించి విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కోటీ 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇదిలా ఉండగా.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ దరఖాస్తుల్లో ఏకంగా ‘శివయ్య’ (దేవుడు)పేరుతో వచ్చిన ఓ దరఖాస్తు అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో అర్జీదారు ‘శివయ్య’ (దేవుడు) కాగా.. భార్య పేరు పార్వతీ దేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా దరఖాస్తులో నింప బడ్డాయి. ప్రస్తుతం ఈ దరఖాస్తు ఫారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

ఇంతకీ ఆ దరఖాస్తు ఎవరు పెట్టారనీ ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన సామాన్యుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ‘శివుడి’ పేరుతో ఈ దరఖాస్తు పెట్టారంట. గ్రామంలోని త్రికూటేశ్వర ఆలయానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 12వ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న అతి పురాతన, అరుదైన, అద్భుతమైన ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. 

ఆరు గ్యారెంటీల పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్న వేళ ఆయనకు ఓ ఆలోచన వచ్చిందట. అనుకున్నదే తడవుగా దేవుడి పేరుతో దరఖాస్తు సమర్పించారు. వివరాల్లో దేవుడి పేర్లనే రాశారు. శివుడి ఫోటోనే అతికించాడు. ఆలయంలో పూజలు జరగడం లేదనీ, ఓ పురోహితుడ్ని నియమించాలని, అలాగే ఆలయానికి ఓ గది కోసం ‘ఇందిరమ్మ ఇల్లు’ కావాల్సిందిగా దరఖాస్తు చేశానని సురేందర్ రెడ్డి తెలిపారు.