Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ చేతిలో అవినీతిపరుల చిట్టా.. వచ్చే ఎన్నికల్లో ఆ 30 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేనట్టేనా ?

పలు పథకాల్లో అవినీతికి పాల్పడిన 30 మంది ఎమ్మెల్యేల జాబితాను సీఎం కేసీఆర్ సిద్ధం చేశారని తెలుస్తోంది. వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున టిక్కెట్లు ఇచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తోెంది. 

List of corrupt people in the hands of CM KCR.. Will those 30 MLAs not have tickets in the next election?..ISR
Author
First Published Apr 29, 2023, 12:41 PM IST

అవినీతికి అడ్డుకట్ట వేయాలని, లేదంటే తొలగింపు తప్పదని బీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ శాసనసభ్యులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ పలువురు ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పార్టీ అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు వారిని షాక్ కు గురి చేశాయి. 

ఈద్ రోజు మసీదుల వెలుపల నమాజ్ చేశారని 2 వేల మందిపై కేసులు.. యూపీలోని అలీగఢ్ పోలీసుల అభియోగాలు

ఏడాది కాలంగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించారని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని భావించిన 30 మంది ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ అవినీతిపరుల చిట్టాలో తమ పేరు ఉందేమోనని పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్టు కూడా తెలుస్తోంది. వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కే అవకాశం కూడా తక్కువగానే కనిపిస్తోంది. 

కారణాలు వేరైనా సీఎం కేసీఆర్ తొలిసారిగా ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడినట్టు బహిరంగంగా అంగీకరించడంతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి, ముఖ్యంగా ప్రతిష్టాత్మక దళిత బంధు లబ్ధిదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సర్వేలో ఎమ్మెల్యేల గ్రూపుయిజం, పేలవమైన పనితీరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఎన్నికలకు ముందైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేసీఆర్ స్వయంగా హెచ్చరించారు. ప్లీనరీలో సీఎం తన వద్ద అక్రమార్కుల జాబితా ఉందని చెప్పారు కానీ ఎమ్మెల్యే పేర్లపై నోరు మెదపలేదు.

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ?

అవినీతిని కేసీఆర్ ఎంతమాత్రం సహించరని, అవినీతి ఆరోపణలు రావడంతో 2015లో ఆయన డిప్యూటీ సీఎంను కూడా సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. తన వద్ద ఉన్న అవినీతి జాబితా గురించి మాట్లాడేటప్పుడు నోరు మెదపలేదు. అవినీతిని సహించని కేసీఆర్ 2015లో అవినీతి ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారని సీనియర్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

సంక్షేమ పథకాల అమలు, ముఖ్యంగా దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, గొర్రెల పెంపకం పథకాలు, జీవో 58 కింద పట్టాల పంపిణీకి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయాలని లేదా సిఫారసు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలను కోరారు. కానీ కొందరు పథకాలను దుర్వినియోగం చేస్తూ, సొంత లాభాల కోసం చూస్తూ.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంగా పుష్కరాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..సికింద్రాబాద్ నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి అంటే

ఆదిలాబాద్, మంచిర్యాల, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని పార్టీ ఉన్నత వర్గాలు తెలిపినట్టు ఇటీవల వార్తలు వస్తున్నాయి. అలాగే దళిత బంధు లబ్ధిదారుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు కమీషన్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని సీఎం తన ప్లీనరీ ప్రసంగంలో కూడా ప్రస్తావించారు. అలాగే గొర్రెల పెంపకం పథకంలో అనర్హులు జీవాలను దక్కించుకున్నారని, వాటిని విక్రయించుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుల్లో కూడా అవినీతి ఉందని గుర్తించినట్టు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios