తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు
తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్.. ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఈ రోజు లెక్కింపు ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. కాగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతోంది.
తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్.. ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఈ రోజు లెక్కింపు ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. కాగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. దాదాపు 90 స్థానాలకుపైగా టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. దాదాపు టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు దన్యవాదాలు చెబుతూ.. కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘కేసీఆర్ పై నమ్మకం ఉంచినందుకు, మరో అవకాశం మాకు ఇచ్చినందుకు దన్యవాదాలు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Grateful, indebted & Humbled 🙏🙏
— KTR (@KTRTRS) December 11, 2018
Thanks Telangana for keeping the faith in KCR Garu & giving us another opportunity to serve you 😊 pic.twitter.com/nSwnaLz8z2
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 7వ తేదీన జరిగిన పోలింగ్ ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సుమారు 40వేలకు పైగా సిబ్బంది ఉన్నారు.