దేశ సరిహద్దులోఉద్రిక్త పరిస్థితి : కేటీఆర్ సంచలన నిర్ణయం
దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశాలు వాయిదా వెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు. మళ్లీ ఎప్పటి నుండి సమావేశాలు నిర్వహించాలో అన్న అంశంపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో సంప్రదించి తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. తదుపరి షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మార్చి 1 నుంచి జరగాల్సిన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేశారు.
దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశాలు వాయిదా వెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు. మళ్లీ ఎప్పటి నుండి సమావేశాలు నిర్వహించాలో అన్న అంశంపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో సంప్రదించి తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. తదుపరి షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు.