Asianet News TeluguAsianet News Telugu

పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ: కీలకాంశాలపై చర్చ


రాష్ట్రంలో చోటు చేసుకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ కార్యాలయాల నిర్మాణం, సభ్యత్వాల డిజిటలైజేషన్ పై కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో చర్చిస్తున్నారు. తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు.

KTR meeting with  TRS General secretaries lns
Author
Hyderabad, First Published Jul 14, 2021, 11:17 AM IST

హైదరాబాద్: పార్టీ సభ్యత్వం, కార్యాలయాల నిర్మాణంతో పాటు తదితర అంశాలపై పార్టీ నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ భేటీ అయ్యారు.  పార్టీ ప్రధాన కార్యదర్శులతో   టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాడు  తెలంగాణ భవన్ లో ఆయన భేటీ అయ్యారు.  రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ చర్చిస్తున్నారు. ప్రధానంగా ఆరు అంశాల ఎజెండాతో ఈ సమావేశం కొనసాగుతోంది.

పార్టీ సభ్యత్వం డిజిటటైజేషన్ తో పాటు  పార్టీ కార్యకర్తల భీమాపై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడ పార్టీ కార్యాలయాలను నిర్మించాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా  ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించారు.

రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని  భావిస్తున్నారు. త్వరలోనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిపై కూడ చర్చించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios