Asianet News TeluguAsianet News Telugu

ట్యాంక్ బండ్ మీద మంత్రి కేటీఆర్ మరో కీలకనిర్ణయం.. !

గత ఆదివారం ట్యాంక్ బండ్ మీద నగర పౌరులు కుటుంబసభ్యులతో సందడి చేశారు.  సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేటీఆర్ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్ సాగర్ లో లేజర్‌ షో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

KTR made another key decision over tankband, hyderabad
Author
Hyderabad, First Published Sep 7, 2021, 12:08 PM IST

హైదరాబాదులోని  ట్యాంక్ బండ్ మీద ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి  రాత్రి 10 వరకు వాహనాల రాకపోకలు నిలిపివేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

గత ఆదివారం ట్యాంక్ బండ్ మీద నగర పౌరులు కుటుంబసభ్యులతో సందడి చేశారు.  సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేటీఆర్ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్ సాగర్ లో లేజర్‌ షో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అన్ని వైపుల నుంచి వీక్షించే లా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు.  హస్తకళలు, సంగీతం, కళలకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పారు.  స్పెషల్ సీఎస్,  హెచ్ఎండిఎ కమిషనర్ అరవింద్ కుమార్  వెంటనే స్పందించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఇప్పటికే ట్యాంక్ బండ్ పై సందర్శకులకు ఆహ్లాదంగా కలిగించేలా ల్యాండ్ స్కేప్,  పచ్చదనం పెంపు కోసం చర్యలు చేపట్టామని తెలిపారు
 

Follow Us:
Download App:
  • android
  • ios