Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా రివర్ బోర్డు మీటింగ్: పోతిరెడ్డిపాడు, పాలమూరు ప్రాజెక్టుల భవితవ్యం తేలేనా?

 కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం గురువారం నాడు ప్రారంభమైంది.  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

krmb holds meeting of telangana, andhra pradesh officials in hyderabad
Author
Hyderabad, First Published Jun 4, 2020, 12:03 PM IST


హైదరాబాద్: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం గురువారం నాడు ప్రారంభమైంది.  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2020-21 సంవత్సరానికి రెండు రాష్ట్రాలకు కృష్ణా నది జలాలు కేటాయింపుతో పాటు కృష్ణా నదిపై రెండు రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు.

పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపును ప్రతిపాదించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే తెలంగాణలోని మహాబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు శాశ్వతంగా ఎడారిగా మారే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్రం వాదిస్తోంది.

krmb holds meeting of telangana, andhra pradesh officials in hyderabad

మరో వైపు తెలంగాణ ప్రభుత్వం  నిర్మించిన తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు , డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పై కూడ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ప్రాజెక్టు నిర్మాణాలను చేపడుతోందని ఏపీ వాదిస్తోంది.

ఈ మేరకు రెండు రాష్ట్రాలు తమ వాదనలతో ఇప్పటికే కృష్ణా బోర్డుకు కూడ ఫిర్యాదు చేశాయి. ఈ విషయమై ఇప్పటికే రెండు రాష్ట్రాలు తమ వాదనలను బోర్డు ముందు విన్పించాయి.

బోర్డు కార్యదర్శిగా ఉన్న పరమేశం ప్రస్తుతం బోర్డు ఛైర్మెన్ గా బాద్యతలు స్వీకరించారు. పరమేశం బోర్డు ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఈ సమావేశం జరుగుతోంది.

also read:తాగు నీటికి ఏపీకి 2 టీఎంసీలకు తెలంగాణ ఒకే: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటి నిర్ణయం

కృష్ణా బోర్డును ఏపీ రాష్ట్రంలోని విజయవాడకు తరలించాలని ఆ రాష్ట్రం డిమాండ్ చేస్తోంది. అంతేకాదు బోర్డు నిర్వహణకు సంబంధించిన నిధుల  విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్వహణపై  అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. 

కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణ వాదనను సమర్ధవంతంగా వినిపించాలని సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు దిశా నిర్ధేశం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios