టీఆర్ఎస్ అభ్యర్థులతో తెలంగాణ భవన్లో కేసీఆర్ భేటీ
తెలంగాణ భవన్లో తమ పార్టీ అభ్యర్థులతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్లో తమ పార్టీ అభ్యర్థులతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు.తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ భవన్లో ఇప్పటివరకు జరిగిన ప్రచార తీరు తెన్నులను, ప్రచార శైలిని సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. మరో వైపు ప్రచారం ముందు.. ఆ తర్వాత చోటు ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల బలా బలాలు ఎలా ఉన్నాయి, ఇతరుల బలాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడ కేసీఆర్ అభ్యర్థులకు వివరించనున్నారు.