Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు చెక్: కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పీవీ కుమార్తె

త్వరలో జరగనున్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సురభి వాణీదేవి పేరును ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. సురభి వాణీదేవి దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె. 

kcr announced for surabhi vani devi as trs candidate for mlc elections ksp
Author
Hyderabad, First Published Feb 21, 2021, 7:26 PM IST

త్వరలో జరగనున్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సురభి వాణీదేవి పేరును ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.

సురభి వాణీదేవి దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె. ఈ మేరకు వాణీదేవి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ స్థానం అభ్యర్థి ఎంపికపై గతకొంత కాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్‌ అభ్యర్థిని ప్రకటించారు. 

ఇప్పటికే వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు కేసీఆర్. దీనికి సంబంధించి బుధవారం ప్రగతి భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌ బీ ఫాం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి..  ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

వరంగల్- నల్గొండ- ఖమ్మం, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ జిల్లాల పట్టాభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి,  ఎన్‌ రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.

దీంతో ఇటీవల కేంద్రం ఆయా స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయొచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios