హైద్రాబాద్ బాలానగర్ లో ఇవాళ దారుణం చోటు చేసుకుంది. రూ. 400 కోసం శ్రీనివాస్ అనే వ్యక్తిని కాశీరాం హత్య చేశాడు.
హైదరాబాద్: నగరంలో హైద్రాబాద్ లో ఆదివారంనాడు దారుణం చోటు చేసుకుంది. రూ. 400ల కోసం శ్రీనివాస్ అనే వ్యక్తిని కాశీరాం అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైద్రాబాద్ బాలానగర్ లో కలకలం రేపింది.హైద్రాబాద్ బాలానగర్ లో కాశీరాం, శ్రీనివాస్ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య రూ. 400ల కోసం గొడవ జరిగింది. ఇవాళ ఉదయం బాలానగర్ పుట్ పాత్ వద్ద కాశీరాం, శ్రీనివాస్ మధ్య గొడవ జరిగింది. బాలానగర్ లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద కర్రతో శ్రీనివాస్ పై కాశీరాం విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు అప్పటికి తన కోపం చల్లారకపోవడంతో అటుగా వస్తున్న లారీ కిందకు శ్రీనివాస్ ను తోసివేశాడు. దీంతో శ్రీనివాస్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
Add Asianetnews Telugu as a Preferred Source

