Asianet News TeluguAsianet News Telugu

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు...

తెల్లవారుజామున 4:30 గంటలకు 8 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చారు. రెండు రోజుల క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనమీద ఐటీ దాడులు జరుగుతాయని తెలిపారు. 

IT raids on Ponguleti Srinivas Reddy's house and offices - bsb
Author
First Published Nov 9, 2023, 7:11 AM IST

ఖమ్మం : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై గురువారం ఉదయం ఐటి దాడులు నిర్వహిస్తుంది. ఖమ్మంలోని పొంగులేటి ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. 8 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చారు.  జరుగుతాయని రెండు రోజుల క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ఖమ్మంలోని పొంగులేటి ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్న ఐటీ  శాఖ అధికారులు. నేడు పొంగులేటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి కుటుంబ సభ్యులందరూ ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఉదయం 4:30 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు వారందరి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పాలేరు, హైదరాబాద్ లలో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పొంగులేటికి చెందిన నివాసాల్లో ఉదయం 6 గం.లనుంచే దాడులు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్ లోని ఆయన నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. పొంగులేటి రాఘవ కన్ స్ట్రక్షన్స్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ లో చేరారు. 

అయితే, ఎంపీ సీటు ఇస్తామని ఇవ్వకపోవడంతో పొంగులేటి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆ తరువాత ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీకి దిగబోతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకుల మీద ఐటీ దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ క్రమంలోనే పొంగులేటి రెండు రోజుల క్రితమే తన మీద కూడా ఐటీ దాడులు జరుగుతాయని అన్నారు. అలాగే జరిగింది. 

పాలేరు, హైదరాబాద్ లలో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పొంగులేటికి చెందిన నివాసాల్లో ఉదయం 6 గం.లనుంచే దాడులు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్ లోని ఆయన నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. పొంగులేటి రాఘవ కన్ స్ట్రక్షన్స్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ లో చేరారు. 

అయితే, ఎంపీ సీటు ఇస్తామని ఇవ్వకపోవడంతో పొంగులేటి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆ తరువాత ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీకి దిగబోతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకుల మీద ఐటీ దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ క్రమంలోనే పొంగులేటి రెండు రోజుల క్రితమే తన మీద కూడా ఐటీ దాడులు జరుగుతాయని అన్నారు. అలాగే జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios