Asianet News TeluguAsianet News Telugu

వివాదం.. కత్తితో విద్యార్థి వీరంగం, ఒకరు మృతి

స్వల్ప వివాదం కారణంగా ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా... మరో విద్యార్థి నేరస్థుడిగా మారాడు. ఈ సంఘటన నల్లొండ జిల్లా కనగల్ మండలం దోరెపల్లిలో  చోటుచేసుకుంది.

inter student kills  classmate and his brother in nalgonda
Author
Hyderabad, First Published Feb 14, 2019, 10:59 AM IST

స్వల్ప వివాదం కారణంగా ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా... మరో విద్యార్థి నేరస్థుడిగా మారాడు. ఈ సంఘటన నల్లొండ జిల్లా కనగల్ మండలం దోరెపల్లిలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దోరెపల్లికి చెందిన ప్రవీణ్, బాపర్తి లక్ష్మణ్ లు నల్గొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. కాగా.. వారం రోజుల క్రితం ఈ ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో లక్ష్మణ్ పై ప్రవీణ్ దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మణ్ కి తీవ్రగాయాలయ్యాయి. దీంతో.. భయపడిన ప్రవీణ్ ఊరువదిలి పారిపోయాడు.

బుధవారం తిరిగి ఇంటికి వచ్చాడు. తనపై దాడి చేసిన విషయంలో ప్రవీణ్ ని నిలదీసేందుకు లక్ష్మణ్ అతని సోదరుడు.. ఇద్దరు బావలను తీసుకొని ప్రవీణ్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో వారి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రవీణ్.. కత్తితో వారందరిపై దాడి చేశాడు.

ఈ దాడిలో లక్ష్మణ్ మృతిచెందగా...చంద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios