Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదుకు బీఆర్ఎస్ డిమాండ్.. ఎందుకంటే..?

BRS: కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ల అమ్మకం అంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి..  డబ్బున్న వారికే టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్, బీజేపీయేనని ఆరోపించారు. ప్రజల మద్దతు ఉన్న వారికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందని తెలిపారు. 
 

Inappropriate language in public meetings, BRS demands registration of case against Revanth Reddy RMA
Author
First Published Nov 9, 2023, 2:54 AM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. వివిధ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఈ క్ర‌మంలోనే హ‌ద్దులు మీరుతూ ప‌లు పార్టీల నాయ‌కులు త‌మ ప్ర‌త్య‌ర్థి నాయ‌కుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారు. బహిరంగ సభల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అధికార బీఆర్ఎస్.. కాంగ్రెస్ ఎంపీపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన విధానం, ఎన్నికల సంఘం సూచనలను ఈ సమావేశంలో వివరించారు. సమావేశం అనంతరం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు తన భాషను గుర్తుంచుకోవాలన్నారు. ఆయ‌న మాట్లాడుతున్న తీరును మార్చుకోవాల‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత తీరు మార్చుకోకపోతే ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారనీ, నామినేషన్ల దాఖలులో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులకు సహకరించాలన్నారు.

ఇదిలావుండ‌గా, ధరణి పోర్టల్‌ను ఉపసంహరించుకుని దాని స్థానంలో న్యూ సిస్టమ్‌ను తీసుకువస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు. ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో టీపీసీసీ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబం ధరణి ముసుగులో హైదరాబాద్‌లో అక్రమంగా భూములు ఆక్రమించిందని, రైతుబంధుపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ల అమ్మకం అంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి..  డబ్బున్న వారికే టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్, బీజేపీయేనని ఆరోపించారు. ప్రజల మద్దతు ఉన్న వారికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందని తెలిపారు.

కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టులను కేసీఆర్‌ దెబ్బతీశారని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీకి గట్టి నిబద్ధత ఉందని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios