తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ను నియమించింది. రవాణాశాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధ ప్రకాశ్కు, రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్గా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేయగా.. ఔషధ నియంత్రణ సంచాలకులుగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. జీడీఏ కార్యదర్శిగా వీ. శేషాద్రికి.. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.