Asianet News TeluguAsianet News Telugu

స్పీకర్ పోచారంని కలిసిన శిక్షణ ఐఏఎస్ లు

పేద ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా స్వామ్య ప్రభుత్వాలకు రెండు కళ్లు లాంటివారని ఆయన పేర్కొన్నారు. 

IAS officers met  telangana assembly speaker pocharam today
Author
Hyderabad, First Published Jul 19, 2019, 2:55 PM IST

అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని శిక్షణ ఐఏఎస్ లు శుక్రవారం కలిశారు. తెలంగాణ కేడర్ కి చెందిన శిక్షణ ఐఏఎస్ లు తమ ట్రైనింగ్ లో భాగంగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాలను పరిశీలించారు. అనంతరం స్పీకర్ పోచారంని కలిశారు. ఈ సందర్భంగా శిక్షణ ఐఏఎస్ లకు పోచారం  శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా స్వామ్య ప్రభుత్వాలకు రెండు కళ్లు లాంటివారని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios