Asianet News TeluguAsianet News Telugu

పాలేరు నుండి పోటీ చేస్తా: తేల్చేసిన వైఎస్ షర్మిల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు.

I will contest from palair assembly segment lns
Author
Khammam, First Published Mar 24, 2021, 2:33 PM IST

హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు.

బుధవారం నాడు ఆమె ఈ విషయాన్ని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలాగో తనకు పాలేరు  అలాగే అని ఆమె చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఆపలేరని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు బుధవారం నాడు లోటస్ పాండ్ లో షర్మిలతో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా నుండి పోటీ  చేయాలని ఆమెను పాలేరుకు చెందిన నేతలు కోరారు.పాలేరు నుండి తాను పోటీ చేస్తానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.  పాలేరు నుండి తాను అసెంబ్లీ నుండి బరిలోకి దిగుతానని ఆమె వారికి హామీ ఇచ్చారు.

తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిల సన్నాహలు చేసుకొంటుంది. ఏప్రిల్ 9న కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మంలో సభ ఏర్పాటుకు షర్మిల మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ మేరకుే సభ నిర్వహణకు కూడ అనుమతి తీసుకొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios