Asianet News TeluguAsianet News Telugu

రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు: దక్కించుకొన్న ఏపీ ఎమ్మెల్సీ రమేష్, స్నేహితుడు శశాంక్ రెడ్డి


బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన లడ్డు వేలంలో రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు లడ్డు విక్రయం జరిగింది. ఏపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అతని పార్ట్‌నగర్  మర్రి శశాంక్ రెడ్డిలు ఈ లడ్డును దక్కించుకొన్నారు. 2019 కంటే రికార్డు స్థాయి ధర పలికింది.

Hyderabads  Balapur Ganesh laddu auctioned for Rs 18.90 lakh
Author
Hyderabad, First Published Sep 19, 2021, 10:24 AM IST


హైదరాబాద్:  బాలాపూర్ గణేష్ లడ్డును గతంలో కంటే రికార్డు స్థాయి ధరకు వేలంలో విక్రయమైంది. ఈ ఏడాది రూ. 18 లక్షల 90 వేలకు బాలపూర్ గణేష్ లడ్డు వేలంలో పాడారు. మర్రి  శశాంక్ రెడ్డి అతని పార్ట్‌నర్ ఏపీ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ  రమేష్ యాదవ్ లు ఈ లడ్డును దక్కించుకొన్నారు.గత ఏడాది కరోనా కారణంగా బాలాపూర్ గణేష్ లడ్డును విక్రయించలేదు. ఈ లడ్డును గత ఏడాదిలో సీఎం కేసీఆర్  కుటుంబసభ్యులకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందించారు.

రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశ్యంతో తాను ఈ వేలం పాటలో పాల్గొని లడ్డును దక్కించుకొన్నట్టుగా రమేష్ యాదవ్ చెప్పారు. ఈ లడ్డును ఏపీ సీఎం జగన్ కు తాను బహుమతిగా అందిస్తానని ఆయన చెప్పారు. తన సోదరుడు శశాంక్ రెడ్డితో కలిపి ఈ లడ్డును దక్కించుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలం పాటలో పాల్గొనేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని మర్రి శశాంక్ రెడ్డి చెప్పారు.  ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకొంటున్నట్టుగా శశాంక్ రెడ్డి తెలిపారు.2019 లో లడ్డు వేలం కంటే ఈ ఏడాది రూ.140 లక్షలు అధికంగా వేలంపాటలో ధర పలికింది. అయితే గతంలో లడ్డును దక్కించుకొన్న వారి కంటే కొత్తవారికి  వేలం పాటలో పాల్గొనేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రాధాన్యత ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios