Asianet News TeluguAsianet News Telugu

అమెరికా చికాగోలో కాల్పులు: విజయవాడ విద్యార్ధి దేవాన్ష్ మృతి, హైద్రాబాద్ విద్యార్ధికి గాయాలు

అమెరికాలోని చికాగోలో జరిగిన కాల్పుల్లో  విజయవాడకు  చెందిన   దేవాన్ష్ అనే విద్యార్ధి మృతి చెందారు హైద్రాబాద్  కు చెందిన  సాయిచరణ్ ఈ ఘటనలో  గాయపడ్డాడు.  

Hyderabad  Student  Sai Charan  injured After  unknown persons firing
Author
First Published Jan 23, 2023, 6:23 PM IST

హైదరాబాద్: అమెరికాలోని చికాగోలో  దుండగుడు  జరిపిన కాల్పుల్లో  విజయవాడకు  చెందిన  దేవాన్ష్ అనే విద్యార్ధి మృతి చెందాడు. ఇదే ఘటనలో హైద్రాబాద్ కు  చెందిన  సాయిచరణ్ అనే విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు.   సాయిచరణ,్ దేవాన్ష్ లు  వాల్ మార్ట్  కు వెళ్లున్న సమయంలో  దుండుగుడు కాల్పులకు దిగాడు. ఈ కాల్లపుల్లో దేవాన్ష్ మృతి చెందినట్టుగా  సమాచారం అందింది.  

వాల్ మార్ట్ వద్ద ఈ ఇద్దరు యువకుల వద్ద  ఉన్న  వస్తువులను దుండగులు  లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే  ఈ ఇద్దరు విద్యార్ధులు  దుండగులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు.  దీంతో   దుండగులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో దేవాన్ష్   మృతి చెందారు.  ఈ కాల్పుల్లో  సాయి చరణ్ గాయపడినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 


 


 

 

Follow Us:
Download App:
  • android
  • ios