క్లిక్ చేస్తే చాలు.. మీ డేటా సైబర్ కేటుగాళ్ల గుప్పిట్లోకి, భయపెడుతున్న జోకర్ సాఫ్ట్వేర్
కరోనా సమయంలో జోకర్ సాఫ్ట్వేర్ ప్రజలను భయపెడుతోంది. జోకర్ సాఫ్ట్వేర్ వల్ల యువత తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే ఈ సాఫ్ట్వేర్ను గూగుల్ ఐదుస్లార్లు డిలీట్ చేసింది. మెట్రో నగరాల్లో ఇప్పటికే కుదిపిస్తోంది ఈ జోకర్ సాఫ్ట్వేర్
కరోనా సమయంలో జోకర్ సాఫ్ట్వేర్ ప్రజలను భయపెడుతోంది. జోకర్ సాఫ్ట్వేర్ వల్ల యువత తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే ఈ సాఫ్ట్వేర్ను గూగుల్ ఐదుస్లార్లు డిలీట్ చేసింది. మెట్రో నగరాల్లో ఇప్పటికే కుదిపిస్తోంది ఈ జోకర్ సాఫ్ట్వేర్. ఫోన్లు, డెస్క్ టాప్లలో ఈ సాఫ్ట్వేర్ ప్రత్యక్షమవుతోంది. జోకర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలోకి మన వ్యక్తిగత సమాచారం వెళ్లిపోతోందని పోలీసులు చెబుతున్నారు. బ్యాంక్ వివరాల నుంచి వ్యక్తిగత ఫోటోలు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుందని చెప్పారు. జోకర్ సాఫ్ట్వేర్ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.