PM Modi: ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు రావడంతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేబీఆర్ పార్క్, ఉస్మానియా యూనివర్శిటీ సహా పలు ప్రాంతాల్లో ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా నగరంలోని యువత బెలూన్లు, బ్యానర్లు, నినాదాలతో తమ నిరసనలను తెలియజేశారు. 

Telangana: ప్రధాని న‌రేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు రావడంతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేబీఆర్ పార్క్, ఉస్మానియా యూనివర్శిటీ సహా పలు ప్రాంతాల్లో ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా నగరంలోని యువత బెలూన్లు, బ్యానర్లు, నినాదాలతో తమ నిరసనలను తెలియజేశారు. రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో కూడా బీజేపీ, ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చోటుచేసుకున్నాయి. కేబీఆర్ పార్కులో తెలంగాణ హందేవ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ‘గో బ్యాక్ మోడీ.. నో ఎంట్రీ టు తెలంగాణ’ అనే ప్లకార్డులతో కూడిన జెండాలు, నల్ల బెలూన్లను ప్ర‌ద‌ర్శించారు. ఇతర చోట్ల కూడా మోడీ వ్యతిరేక నిరసనలు కొనసాగాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

వివ‌రాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేబీఆర్ పార్క్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సహా వివిధ ప్రదేశాలలో ప్రధానమంత్రి పర్యటనకు వ్యతిరేకంగా నగరంలోని యువత తమ నిరసనలు తెలిపారు. నవంబర్ 12న రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని సందర్శించారు. ప్రారంభోత్సవానికి ముందు ఆయన బహిరంగ సభ కూడా నిర్వహించారు.

Scroll to load tweet…

ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్‌వీ)కి చెందిన 50 మంది విద్యార్థులు నల్లజెండాలతో ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అంబర్‌పేట పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన బూటకపు వాగ్దానాలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని టీఆర్‌ఎస్‌వీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి అన్నారు. “పీఎం మోడీ 2014లో అధికారంలోకి వచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటిఐఆర్), రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) వంటి ప్రాజెక్టులను రాష్ట్రానికి వాగ్దానం చేసినప్పటికీ, ఏ అభివృద్ధి కూడా జరగలేదు. దీనికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాము” అని కరుణాకర్ రెడ్డి చెప్పిన‌ట్టు సియాస‌త్ నివేదించింది. 

Scroll to load tweet…