భార్యను బ్యాట్తో కొట్టి చంపిన భర్త
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాకలో భార్యను భర్త క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాకలో భార్యను భర్త క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ దేశాయిపేట ఎంహెచ్ నగర్కు సునీత, లంక రాములు 11 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. బుధవారం నాడు భార్య భర్తలు గొడవ పెట్టుకొన్నారు.
ఈ సమయంలో ఆవేశానికి లోనైన రాములు భార్య సునీతను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడు. ఆ తర్వాత అతను పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.