అపోలో ఆసుపత్రి నిర్వాకం.. చనిపోయిన వ్యక్తిపై రూ.24 లక్షల బిల్లు, బంధువుల ఆందోళన
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. పేషెంట్కు రూ.24 లక్షల బిల్లు వేయగా.. ఇప్పటి వరకు రూ.9 లక్షలు కట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.