Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : గొడ్డలితో దాడి, ఇంటికి నిప్పు.. చెట్ల తిమ్మాయిపల్లిలోఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు...

వివాహేతర సంబంధం నేపత్యంలో లక్ష్మణ్ అనే వ్యక్తిపై నర్సింహులు అనే వ్యక్తి గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు అతడిని ఆసుపత్రిలో తరలించారు. 

high tension in chetlatimmayipally over extramarital affire, medak
Author
Hyderabad, First Published Aug 26, 2021, 11:01 AM IST

మెదక్ : మాసాయి పేట మండలం చెట్ల తిమ్మాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. వివాహేతర సంబంధం నేపత్యంలో లక్ష్మణ్ అనే వ్యక్తిపై నర్సింహులు అనే వ్యక్తి గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. 

లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు అతడిని ఆసుపత్రిలో తరలించారు. ఆగ్రహంలో నర్సింహులు ఇంటికి లక్ష్మణ్ కుటుంబ సభ్యులు నిప్పు పెట్టారు. ఇరు వర్గాల ఘర్షణలో గ్రామంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 

ఇదిలా ఉంటే... కరీంనగర్ జిల్లా, జగిత్యాలలో తనను ప్రేమించాలని ఓ యువతి వేధింపులకు గురిచేస్తుండడంతో పెళ్లైన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెడితే.. మల్యా మండలంలోని లంబాడిపల్లికి చెందిన వేముల గణేష్ ట్యాక్సీ డ్రైవర్. ట్యాక్సీ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి గోదావరి అనే యువతితో పెళ్లి అయ్యింది. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.

కాగా, ఇదే మండలం తాటిపల్లికి చెందిన ఓ యువతి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమె తరచుగా గణేష్ ట్యాక్సీలోనే స్వగ్రామానికి వెళ్లేది. అలా వారిద్దరి మధ్య పరిచయం, స్నేహంగా మారింది. కొద్దికాలం తరువాత ఆ యువతి గణేష్ ను ప్రేమ పేరుతో వేధిండం మొదలుపెట్టింది. 

దీనికి అతను నిరాకరించాడు. దీంతో రెండు రోజులు వేరే వ్యక్తులతో ఫోన్ చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. గణేష్ కు ఏం చేయాలో పాల్పొలేదు. వేదింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురై బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి, జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గణేశ్ చికిత్స పొందుతున్నాడు. ఆ యువతి నుంచి తనను ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios