పోడు భూముల వివాదం.. భద్రాద్రి జిల్లాలో ఆదివాసీలు, పోలీసులకు మధ్య ఘర్షణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో ఆదివాసీలు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ మహిళలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల విషయంలో ఆదివాసీలు , పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ మహిళలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. మహిళలపై మగ పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.