వీహెచ్ ను పరామర్శించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ..
కిడ్ని సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా చికిత్స పొంది ఇటీవల నే ఇంటికి వచ్చిన వి.హనుమంతరావును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు.
అంబర్ పేటలోని కాంగ్రెస్ పార్టీ మాజి ఎంపి హనుమంతరావు ఇంటికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సందర్శించారు.
కిడ్ని సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా చికిత్స పొంది ఇటీవల నే ఇంటికి వచ్చిన వి.హనుమంతరావును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు.
కాగా, గత నెలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కరోనా సోకింది. ఆయన ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. అస్వస్థతకు గురైన వి. హనుమంతరావు శనివారం నాడు ఆపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది. అదే ఆసుపత్రిలో ఆయన కరోనాకు చికిత్స తీసుకొంటున్నారు.