పల్లీ నూనెతో పల్టీ: రెండు పెళ్లిళ్లు, ఎవరీ శ్రీకాంత్?
పల్లీనూనె వ్యాపారం పేరుతో వందలాది మందికి టోకరా ఇచ్చి రూ.100 కోట్లు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు గ్రీన్గోల్డ్ బయోటెక్ కంపెనీ ఎండీ జిన్నా శ్రీకాంత్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్ తో పాటు మరో ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాదులోని ఉప్పల్ కేంద్రంగా అక్రమాలకు పాల్పడిన వీరి నుంచి రూ.5 కోట్ల విలువైన స్థిర,చరాస్తులతో పాటు రూ.21.20లక్షల నగదు, 20లీటర్ల పల్లీనూనె, 20లీటర్ల ఖాళీ క్యాన్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆ విషయాలను మంగళవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా సంకేట్ గ్రామానికి చెందిన జిన్నా కాంతయ్య అలియాస్ జిన్న శ్రీకాంత్రెడ్డి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.
అదే సమయంలో తన కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా చేరిన అహల్యారెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఉప్పల్లోని ఫిర్జాదిగూడలో అహల్యారెడ్డి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు.
మార్చి 15 వరకు గోదాం లీజ్ అగ్రిమెంట్ పూర్తి అవుతుండడంతో కర్నూలులో రియల్ దందాకు సిద్ధమయ్యాడు. ఇతడిపై ఇప్పటికే హైదరాబాద్లో ఐదు కేసులు, వరంగల్ అర్బన్లో ఒక కేసు, కడపలో రెండు కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు.
జిన్న కాంతయ్య సోదరుడు వెంకటేశ్వర్రెడ్డి 2014లో సికింద్రాబాద్లో గ్రీన్గోల్డ్ బయోటెక్ కంపెనీ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో 2017 వరకు అతను దానిని పట్టించుకోలేదు.
రెండో భార్య అలేఖ్యారెడ్డి, బావమరిది అనిల్రెడ్డి, మేనేజర్ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రియ సహకారంతో మల్టీలెవల్ మోసాలను ప్రారంభించాడు సూరత్ నుంచి రూ.20వేలకు కొనుగోలు చేసి తెప్పించిన పల్లీనూనె యంత్రాలతో రూ.లక్షల్లో ఆదాయం వస్తుందంటూ ప్రచారానికి తెరలేపాడు.
పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.10 వేలతో పాటు రూ.5 వేల అలవెన్స్ 24 నెలల పాటు ఇస్తానంటూ మభ్యపెట్టాడు. రూ.రెండు లక్షల మెషిన్ కొనుగోలు చేస్తే 80 కిలోల నూనె, 400 కిలోల పల్లీలు ఇస్తామని, ఆ పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.20వేలతో పాటు అలవెన్స్ కింద రూ.పది వేలు రెండేళ్ల పాటు చెల్లిస్తామని శ్రీకాంత్ చెప్పాడు.
రూ.2లక్షల స్కీంలో 144మందిని, ఐదు లక్షల స్కీంలో 19 మంది, పదిలక్షల స్కీంలో నలుగురిని చేర్పించాడు. ఆయా స్కీంలలో చేరిన వారికి డబ్బులు ఇవ్వకుండా పల్లీలు, మిషన్లు, అందజేశాడు. తన కంపెనీలో ఉద్యోగులను కూడా ఒక నెలపాటు పనిచేయించుకొని తొలగించేవాడు.
దానిపై సమాచారం అందడంతో సీపీ సూచనమేరకు ఈ బాగోతంపై దృష్టి సారించిన ఉప్పల్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రధాన సూత్రధారి జిన్నా కాంతయ్యతో పాటు కంపెనీ మేనేజర్ భాస్కర్ యాదవ్, లంకప్రియను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుతో సంబంధమున్న వెంకటేశ్వర్రెడ్డి, అలేఖ్యారెడ్డి, అనిల్రెడ్డి, అంజయ్యగౌడ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.