తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్టేజ్ ఎక్కుతూ తూలి కిందపడిపోయారు. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్ధుల సమ్మేళనానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైకి చేరుకునేందుకు ఆమె మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా తూలి కిందపడబోయారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్టేజ్ ఎక్కుతూ తూలి కిందపడిపోయారు. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్ధుల సమ్మేళనానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైకి చేరుకునేందుకు ఆమె మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా తూలి కిందపడబోయారు. వెంటనే అప్రమత్తమైన గవర్నర్ భద్రతా సిబ్బంది.. తమిళిసైని పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…

మరోవైపు.. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.