ప్రగతి భవన్‌లో జరిగిన గోదాదేవి కళ్యాణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు

ప్రగతి భవన్‌లో జరిగిన గోదాదేవి కళ్యాణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, శోభా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది. హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మ వారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred