డెడ్ బాడీని  తరలిస్తున్న అంబులెన్స్  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులో  పడింది.ఈ ప్రమాదంలో  అంబులెన్స్ లో  ఉన్న  నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. 

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తరోడా వద్ద వాగులో అంబులెన్స్ పడింది. ఈ ప్రమాదం నుండి అంబులెన్స్ లో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

జైనథ్ నుండి మహారాష్ట్రలోని నాందేడ్ వైపు అంబులెన్స్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ లో మృతదేహన్ని నలుగురు వ్యక్తులు తీసుకె
ళ్తున్నారు.ఈ సమయంలో అంబులెన్స్ ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ నుండి పోలీసులు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. అంబులెన్స్ లో ఉన్న మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.