కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో భార్యభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని అహ్మద్, పర్వీన్, మోయిన్, అద్వాన్లుగా గుర్తించారు. వివరాలు.. వర్షాలు కురుస్తుండటంతో బట్టలు ఆరవేసేందుకు ఇంట్లోనే జే వైర్ కట్టారు. అయితే బట్టలు ఆరవేస్తుండగా పర్వీన్ విద్యుత్ షాక్కు గురైంది. ఆమెను రక్షించే భర్త, పిల్లలు కూడా విద్యుత్ షాక్తో మృతిచెందారు. వారిని ఆస్పత్రికి తరలించిన కూడా లాభం లేకుండా పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
