నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నం చేసుకొన్న తండ్రి
నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎత్తంలో ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు తండ్రి ఒంకార్.
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలం ఎత్తం గ్రామంలో బుధవారం నాడు విషాదం చోటు చేసుకంది. కొడుకు, కూతురు గొంతు కోసిన తర్వాత ఒంకార్ అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గొంతు కోసుకొని ప్రాణపాయస్థితిలో ఉన్న ఒంకార్ ను గుర్తించిన స్థానికులుఆసుపత్రికి తరలించారు. ఒంకార్ పరిస్థితి విషమంగా ఉందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.ఒంకార్ ది కొల్లాపూర్ మండలం కుడికళ్ల గ్రామంగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలతోనే ఒంకార్ ఈ దారుణానికి పాల్పడినట్టుగా చెబుతున్నారు.