దైవదర్శనానికి వెళ్లివస్తున్న ఓ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు.
దైవదర్శనానికి వెళ్లివస్తున్న ఓ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు.
ఆయిల్ ట్యాంకర్ ను కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని బ్యాంకర్స్ కాలనీ వాసులు దైవ దర్శనానికి తిరుమల వెళ్లి వస్తున్నారు.
తిరిగి వస్తుండగా ఈ తెల్లవారుజామున తిమ్మాపూర్ వద్దకు రాగానే ఆయిల్ ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ చక్రవర్తి, అతని కుమారుడు కల్యాణ చక్రవర్తి అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 19, 2020, 11:36 AM IST